Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
గురుదక్షిణ సమర్పిస్తున్న హాట్ హీరోయిన్ సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత తనను అలా ప్రొజెక్టు చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ కి గురు దక్షిణ చెల్లించాలనుకుంటోంది. అందుకోసమే ఆమె ఎర్ర గులాబీలు చిత్రంలో గెస్ట్ గా చేసింది. అలాగే ఆ చిత్రంలో సమీరా రెడ్డి,సమంత హీరోయిన్స్ గా చేసారన్నా సైలెంట్ గా ఉంటోంది. ఇక ఎర్రగులాబీలు చిత్రం జనవరి 28న విడుదల అవుతోంది.
ఈ సందర్బంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ...ఇది ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. అందుకే షూటింగ్ రాత్రి పూటే తీసాము. టెక్నికల్ గా బాగా కష్టపడి చేసాము అన్నారు. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అన్నారు. అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ లో పాటలుండవు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం రూపొందుతున్నా తెలుగుకు మాత్రమే ఈ 'ఎర్ర గులాబీలు" టైటిల్ ని ఉపయోగిస్తున్నారు. మనోజ్ పరమహంస దీనికి కెమెరా వర్క్ ని అందిస్తున్నారు. బాలచందర్ దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో 'ఎర్రగులాబీలు" ఒకటి. ఈ థ్రిల్లర్ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే.