Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాత్రికి రాత్రే రేటు పెంచేసిన మహేష్ హీరోయిన్...!?
కేవలం మూడే మూడు చిత్రాలతో తెలుగులో అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది సమంత. ఇప్పుడంతా ఈ భామని లక్కీగాళ్ అంటున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి అందులో జెస్సీగా కనిపించి కుర్రకారుని తన మాయలో పడేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన 'బృందావనం"లో నాజూకు అందాలతో ఆకట్టుకుంది. ఈ రెండు విజయాలతో మహేష్ సరసన 'దూకుడు" చిత్రంలో నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది సమంత.
ఈ చిత్రంతో వరుసగా మూడో విజయాన్ని దక్కించుకున్న ఈ భామ తన పారితోషికాన్ని కోటికి పెంచేసి కోటి రూపాయల పారితోషికం అందుకునే భామల లిస్ట్ లో చేరిపోయిందని తెలుస్తోంది. 'దూకుడు" చిత్రానికి ముందు దాదాపుగా యాభై లక్షలు మాత్రమే పారితోషికాన్ని స్వీకరించిన సమంత 'దూకుడు" విజయంతో పారితోషికం విషయంలో తన దూకుడు చూపించనుందట. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ", గౌతమ్మీనన్ రూపొందిస్తున్న త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు త్వరలో శ్రీనువైట్ల-జూ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న చిత్రంలోనూ, అలాగే బొమ్మరిల్లు భాస్కర్-అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలోనూ సమంత నటించనుందని తెలుస్తోంది.
అయితే 'దూకుడు" విజయంతో పారితోషికాన్ని అమాంతం పెంచడానికి కారణమేంటని సమంతని అడిగితే 'డిమాండ్ వున్నప్పుడే కదా మనం ఏమైనా డిమాండ్ చేయగలం. ప్రస్తుతం నాకున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని పారితోషికంపై ప్రత్యేక దృష్టి పెట్టాను" అంటోంది సమంత.