Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
దుకాణంలో కూరగాయలన్నీ మాయం చేసిన సమంత!
సమంత వలన దుకాణంలో కూరగాయలన్నీ మాయమైపోయాయి. సమంత కూరగాయలు ఎలా మాయం చేసిందని అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. సమంత ఇటీవల చెన్నైకి వెళ్ళింది. రోడ్డుపక్కన గల కూరగాయల దుకాణం ముందు కూర్చోవడంతో జనాలు ఆ దుకాణం వద్దకు ఎగబడ్డారు.
సమంత కొన్నేళ్లుగా ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన ట్రస్ట్ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నారులకు చికిత్స చేయిస్తోంది. దీనికోసం ట్రస్ట్ తరుపున నిధులు సేకరిస్తోంది. అందులో భాగంగానే చెన్నైలో సమంత కూరగాయలు అమ్మే వ్యక్తిగా అవతారం ఎత్తింది.
రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణం వద్దకు వెళ్లి యజమానికి అసలు విషయం చెప్పింది. సమంత కూరగాయలు అమ్ముతుందని తెలియడంతో జనాలు ఎగబడ్డారు. కిలో ఎంత అని బేరాలు ఆడకుండా అడిగినంత డబ్బు ఇచ్చి సమంత నుంచి కూరగాయలు కొనుక్కుని వెళ్లారు. నిమిషాల వ్యవధిలో దుకాణంలోని అన్ని కూరగాయలు అయిపోయాయి. అది సంగతి.