Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దుకాణంలో కూరగాయలన్నీ మాయం చేసిన సమంత!
సమంత వలన దుకాణంలో కూరగాయలన్నీ మాయమైపోయాయి. సమంత కూరగాయలు ఎలా మాయం చేసిందని అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. సమంత ఇటీవల చెన్నైకి వెళ్ళింది. రోడ్డుపక్కన గల కూరగాయల దుకాణం ముందు కూర్చోవడంతో జనాలు ఆ దుకాణం వద్దకు ఎగబడ్డారు.
సమంత కొన్నేళ్లుగా ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన ట్రస్ట్ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నారులకు చికిత్స చేయిస్తోంది. దీనికోసం ట్రస్ట్ తరుపున నిధులు సేకరిస్తోంది. అందులో భాగంగానే చెన్నైలో సమంత కూరగాయలు అమ్మే వ్యక్తిగా అవతారం ఎత్తింది.
రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణం వద్దకు వెళ్లి యజమానికి అసలు విషయం చెప్పింది. సమంత కూరగాయలు అమ్ముతుందని తెలియడంతో జనాలు ఎగబడ్డారు. కిలో ఎంత అని బేరాలు ఆడకుండా అడిగినంత డబ్బు ఇచ్చి సమంత నుంచి కూరగాయలు కొనుక్కుని వెళ్లారు. నిమిషాల వ్యవధిలో దుకాణంలోని అన్ని కూరగాయలు అయిపోయాయి. అది సంగతి.