Don't Miss!
- News టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
‘ఎర్రగులాబీలు’ గా మారిపోతున్న సమంత, సమీరా రెడ్డి
భారతీ రాజా దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో 'ఎర్రగులాబీలు" ఒకటి. ఈ థ్రిల్లర్ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే. తాజాగా ఇదే టైటిల్ తో గౌతమ్ వాసుదేవమీనన్ (ఏ మాయ చేసావె ఫేం) ఓ థ్రిల్లర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, సమీరారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాటలుండవు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం రూపొందుతున్నా తెలుగుకు మాత్రమే ఈ 'ఎర్ర గులాబీలు" టైటిల్ని ఉపయోగిస్తున్నారు. మనోజ్ పరమహంస దీనికి కెమెరా వర్క్ని అందిస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ...ఇది ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. అందుకే షూటింగ్ రాత్రి పూటే తీసాము. టెక్నికల్ గా బాగా కష్టపడి చేసాము అన్నారు. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అన్నారు. ఈ చిత్రం ప్రోమోస్ విడుదల హైదరాబాద్ లో తాజ్ బంజారాలో జరిగింది.