Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చైతుతో ఆ విషయాలు మాట్లాడను.. అది నేర్చుకున్నా.. సమంత!
నాగచైతన్య, సమంత గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సమంత రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించింది. సమంత ఇటీవల రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో సమంత అద్భుత నటన కనబరిచింది. పల్లె టూరి యువతిగా రామలక్ష్మి పాత్రలో సమంత ఆకట్టుకుంది.
చైతు, తాను మంచి పరిపక్వతతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని సమంత తెలిపింది. సినిమాకు సంబందించిన విషయాలు తాము మాట్లాడుకోమని సమంత తెలిపింది. తన చిత్రాల గురించి కథల గురించి చైతు తో చర్చించను. అతడు కూడా సినిమాకు సంబందించిన విషయాలు ఇంట్లో ప్రస్తావించడు అని సమంత తెలిపింది. ప్రొఫెషనల్ లైఫ్ కి సంబందించిన విషయాలు ఏవి తమ మధ్య చర్చకు రావని సమంత తెలిపింది.
తాను చైతుని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని సమంత తెలిపింది. తన చిత్రాలు పరాజయం చెందితే గతంలో బాధపడే దాన్ని అని సమంత తెలిపింది. కానీ నాగచైతన్యని చూసాక తనలో మార్పు వచ్చిందని సమంత తెలిపింది. ఇప్పుడు తాను విజయం, పరాజయం రెండింటిని ఒకేలా చూస్తున్నానని సమంత తెలిపింది.