Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Samantha: సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్! ఇలా అనుకోలేదు..
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ సమంత. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా జోరుగా దూసుకుపోతోంది సామ్. ఇటీవలే ఆమె నటించిన యశోద చిత్రం టీజర్ విడుదలై ఆకట్టుకుంది. దీని తర్వాత పాన్ ఇండియాగా వస్తున్న శాకుంతలం సినిమా నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇచ్చారు.
చాలా రోజుల కిందటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సౌత్ ఇండియా పాపులర్ కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటి తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ చాలా రోజుల కిందటే పూర్తియింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇటీవల ఈ మూవీని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమంత అభిమానులు సంబరపడిపోయారు.
విడుదల చేయలేకపోతున్నాం..
కానీ, మళ్లీ సంతోషంగా ఉన్న అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు శాకుంతలం దర్శక నిర్మాతలు. ఈ సినిమాను అనుకున్నట్లుగా నవంబర్ 4న విడుదల చేయలేకపోతున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ''నవంబర్ 4 నాటికి ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కావడం లేదు. అలాగే ఈ మూవీని 3D ఫార్మాట్ లో విడుదల చేయనున్నాం. అందుకే 3D పనులకు మరికొంత సమయం అవసరం ఉంది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. మరో కొత్త తేదిని త్వరలో ప్రకటిస్తాం'' అని అధికారికంగా అనౌన్స్ చేశారు.
మొదటిసారిగా పౌరాణిక పాత్రలో..
దీంతో సమంత అభిమానులకు మూవీ వాయిదా పడటం బ్యాడ్ న్యూసో.. చిత్రం 3Dలో రావడం గుడ్ న్యూసో తెలియడం కష్టంగా ఉంది. అలాగే ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు. ఇక ఈ మూవీలో సమంత మొదటిసారిగా పౌరాణిక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా యాక్ట్ చేశాడు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా ఉన్నాడు దేవ్ మోహన్. అలాగే మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను దిల్ రాజు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సమంత, దేవ్ మోహన్ చాలా రొమాంటిక్ గా కనిపించారు.
|
చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ..
ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో మెరవనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ శాకుంతలం చిత్రంలో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.