Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ లవకుశ : ఫ్యాన్స్ కోసం ఒక బిగ్ సర్ప్రైజ్
ఎన్టీయార్ లవకుశ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో క్యామియో చేయనున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు..
జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో లో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా ఈ మూడుపాత్రలతోనూ జతకట్టే ముగ్గురు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు..
జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు అన్న సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.నెగెటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు. ఇద్దరు హీరోలూ ఒక విల క్యారెక్టర్లు కావటంతో ఈ విలన్ పాత్రకి హీరోయిన్ లేదన్నమాట.
కాగా, ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో క్యామియో చేయనున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. ఇప్పటికే ఎన్టీయార్తో నాలుగు సినిమాలు చేసిన సమంత. జస్ట్ ఓ ఐదు నిమిషాల పాటు కనబడే సర్ప్రైజింగ్ అప్పీరియెన్స్ ఇవ్వనుందట సమంత. సమంత ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న 'రాజుగారి గది-2'తోపాటు సుకుమార్, చరణ్ కాంబినేషన్లో కూడా నటిస్తోంది.