Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
తెలుగు పరిశ్రమపై విన్నవన్నీ అబద్దాలే...సమంత
తెలుగు పరిశ్రమ అలా ఉంటుందట.. ఇలా ఉంటుందట అని రకరకాలుగా నాకు చెప్పేవారు. అవన్నీ వట్టి మాటలే అని ఇక్కడకి వచ్చిన తరవాతే తెలిసింది. క్రమశిక్షణకు విలువిస్తారిక్కడ. అది నాకు బాగా నచ్చింది'' అంటూ సమంత ఇండస్ట్రీని ఓ రేంజిలో లేపి మాట్లాడింది. ఏ మాయ చేసేవే చిత్రంతో పరిచయమైన సమంత నటించిన 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ఈ వారంలో రిలీజవుతోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇక ఈ ముద్దుగుమ్మ 'బృందావనం'లో తన పాత్ర గురించి చెబుతోంది.
ఆమె మాటల్లోనే...'బృందావనం' చిత్రంలో నా పాత్ర పేరు ఇందు. కాలేజీలో చదివే అమ్మాయి. ఆధునికంగా ఉంటాను. డ్యాన్సులు బాగా చేస్తానని నా ఫ్రెండ్స్ అంటారు. మొదట్లో చిన్నగా ఉన్నా తర్వాత అదే కీలకంగా మారుతుంది. అలాగే 'ఏ మాయ చేసావె' లోని జెస్సీ పాత్రకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మిగిలింది సస్పెన్స్ అని ఊరిస్తోంది. ఇక తారక్తో డ్యాన్సులు అంటే మొదట్లో చాలా టెన్షన్ గా అనిపించినా ఇప్పుడు చాలా హ్యాపీగా టెన్షన్గానే ఉందంటోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. కాజల్ కూడా మరో హిరోయిన్ గా చేస్తోంది.