Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు పరిశ్రమపై విన్నవన్నీ అబద్దాలే...సమంత
తెలుగు పరిశ్రమ అలా ఉంటుందట.. ఇలా ఉంటుందట అని రకరకాలుగా నాకు చెప్పేవారు. అవన్నీ వట్టి మాటలే అని ఇక్కడకి వచ్చిన తరవాతే తెలిసింది. క్రమశిక్షణకు విలువిస్తారిక్కడ. అది నాకు బాగా నచ్చింది'' అంటూ సమంత ఇండస్ట్రీని ఓ రేంజిలో లేపి మాట్లాడింది. ఏ మాయ చేసేవే చిత్రంతో పరిచయమైన సమంత నటించిన 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ఈ వారంలో రిలీజవుతోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇక ఈ ముద్దుగుమ్మ 'బృందావనం'లో తన పాత్ర గురించి చెబుతోంది.
ఆమె మాటల్లోనే...'బృందావనం' చిత్రంలో నా పాత్ర పేరు ఇందు. కాలేజీలో చదివే అమ్మాయి. ఆధునికంగా ఉంటాను. డ్యాన్సులు బాగా చేస్తానని నా ఫ్రెండ్స్ అంటారు. మొదట్లో చిన్నగా ఉన్నా తర్వాత అదే కీలకంగా మారుతుంది. అలాగే 'ఏ మాయ చేసావె' లోని జెస్సీ పాత్రకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మిగిలింది సస్పెన్స్ అని ఊరిస్తోంది. ఇక తారక్తో డ్యాన్సులు అంటే మొదట్లో చాలా టెన్షన్ గా అనిపించినా ఇప్పుడు చాలా హ్యాపీగా టెన్షన్గానే ఉందంటోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. కాజల్ కూడా మరో హిరోయిన్ గా చేస్తోంది.