Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఏమైంది? ఎయిర్ పోర్టులో సమంత ఎందుకు ఏడ్చింది?
హైదరాబాద్: రభస షూటింగ్ ముగియడంతో తమిళ చిత్రం షూటింగులో భాగంగా హీరోయిన్ సమంత చెన్నై బయల్దేరింది. అయితే ఉన్నట్టుండి సమంత ఎయిర్ పోర్టులోనే ఏడ్చేసింది. అసలు ఏం జరిగిందని అంతా కంగారు పడ్డారు. అయితే వెంటనే తన ట్విట్టర్ ద్వారా అసలు విషయం వెల్లడించింది సమంత. ఇదంతా మేరీకామ్ మూవీ ట్రైలర్ చూసిన ఫలితమే.
'ఎయిర్ పోర్టులో ఉండగా మేరీకామ్ ట్రైలర్ చూశాను. ఉన్నట్టుండి పబ్లిక్లోనే ఏడుపొచ్చింది. ఎందుకో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. అద్భుతమైన ఫీలింగ్' అని సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మేరీకామ్ ట్రైలర్లో ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో ప్రశంసల వర్షం కురుస్తోంది.
కొన్ని రోజుల క్రితం కూడా సమంత 'మేరీకామ్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించింది. అసలు సిసలు బాక్సర్ లా అనిపించుకోవటానికి ప్రియాంకా చాలా కసరత్తులే చేసింది. అంతేకాక బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఎన్నో శారీరక వ్యాయామాలు చేసింది. ఫస్ట్ లుక్ అద్భుతంగా వుంది.
''మేరీ కామ్గా ప్రియాంకా ఒదిగిపోయిన వైనం అద్భుతంగా ఉందని, పాత్రలో ఇంతలా పరకాయ ప్రవేశం చేయడం నమ్మశక్యంగా లేదనీ, ప్రియాంకకు అభినందనలు అని'' ట్వీట్ చేశారు సమంత. అది మాత్రమే కాదు.. ప్రియాంకను అభినందిస్తూ తనకు వచ్చిన ట్వీట్స్ అన్నింటినీ సమంత రీట్వీట్ చేశారు. భారత మహిళా బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న 'మేరీ కామ్'లో ప్రియాంకా చోప్రా టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.