Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సేవా కార్యక్రమాల్లో సమంత ముందడుగు
హైదరాబాద్ : స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలతో బాగా డబ్బులు వేనకేసుకోవడం మాత్రమే కాదు.....తన సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ, అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది ప్రముఖ హీరోయిన్ సమంత.
తాజాగా సమంత 'ప్రత్యూష పౌడేషన్' తరుపున సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నారు. పిల్లలు, మహిళ సాధికారత కోసం ఈ ఆర్గనైజేషన్ పని చేస్తోంది. ఇందుకోసం నిధులు సేకరించే పనిలో ఉంది సమంత.
ఇందులో భాగంగా సినిమాల్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా వచ్చిన డబ్బులను ప్రత్యూష ఫౌండేషన్ తరుపున జరిగే సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తారట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా వెల్లడించింది.
'త్వరలో వేలం కార్యక్రమం జరుపబోతున్నాం. సినిమాల్లో నేను వేసుకున్న వస్త్రాలను వేలం వేస్తాం. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. ఇతర స్టార్లకు సంబంధించిన వస్తువులను కూడా ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.