Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కర్నూలులో ‘శంభో..శివశంభో’
బెల్లంకొండ పద్మావతి సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.సముధిరకణి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో...శివశంభో" చిత్రం షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ హీరోలుగా ప్రియమణి కాథానాయికగా నటిస్తున్నారు. తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'నాడోడిగళ్" చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ' ఈ నెల 16 నుంచి 20 వరకు హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేసి 21 నుంచి కర్నూలులో షూటింగ్ ప్రారంభించాం. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం అహూబిలంలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నామని తెలియజేశారు.
సముధిరకణిని ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం చేస్తున్నాం. స్నేహం తాలూకు ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమా వుంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో సునీల్, రోజా, కృష్ణభగవాన్, కృష్ణుడు, ముఖేష్ రిషి, రాజా రవీంద్ర, ఆహుతి ప్రసాద్, జీవా, సుధ, కిన్నెర, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సుందర్ సి.బాబు అందిస్తున్నారు.