Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రైన్ లో బాంబు పెట్టే టెర్రిరిస్టుగా సమీరా రెడ్డి
సమీరారెడ్డి ఈ మధ్య కాలంలో అన్నీ డిఫెరెంట్ పాత్రలే చేస్తోంది. తాజాగా ఆమె ప్రియదర్శన్ దర్శకత్వంలో టెర్రరిస్టుగా కనిపించనుంది. ఈ విషయాన్ని ఆయనే కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఇంకా పేరు పెట్టిని ఈ చిత్రం హాలీవుడ్ ధ్రీల్లర్ స్పీడ్ ఆధారంగా రూపొందుతోంది. స్పీడు చిత్రం బస్ లో బాంబ్ పెడితే దాని స్పీడు ఆపకుండా నడపాల్సిన పరిస్ధితుల్లో ఎలా సేఫ్ గా బయిటపడ్డారనే పాయింట్ పై ఆధారపడి తీసారు. అయితే ప్రియదర్శన్ చిత్రం మాత్రం ట్రైన్ లో కొందరు టెర్రరిస్టులు బాంబు పెడితే, ట్రైన్ స్పీడు తగ్గికే పేలే పరిస్ధితుల్లో ఆ బాంబ్ ని ఎలా డీ యాక్టివేట్ చేసారు అన్న కథనంతో నడుస్తుంది. ఇదే కథతో బుల్లెట్ ట్రైన్ అనే చిత్రం జపాన్ లో వచ్చింది.
అదే హాలీవుడ్ చిత్రంల స్పీడు కు ప్రేరణ. అయితే తాను బుల్లెట్ ట్రైన్ చిత్రం తీయటం లేదని, స్పీడు చిత్రం నుంచే ప్రేయణ పొంది చేస్తున్నానని ప్రియదర్శన్ అంటున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని లండన్ లో చిత్రీకరించనున్నారు. మనోజ్ బాజపేయ్ ఈ చిత్రంలో ఇంజనీర్ గా నెగిటివ్ పాత్ర చేస్తూంటే..అజయ్ దేవగన్, తుషార్ కపూర్, సమీరా టెర్రరిస్టు ట్రూప్ గా కనిపించనున్నారు. అలాగే అజయ్ దేవగన్ సరసన కంగనా రౌనత్ ని ఎంపికచేసారు. అలాగే ప్రియదర్శన్ పర్మనెంట్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.