Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ ఎన్టీఆర్ ప్రియురాలికి రాళ్లతో దేహ శుద్ది...
జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల పాట్నాలో గోర పరాభవం ఎదుర్కొన్నారు. భోజ్ పురి నటుడు రవికిషన్ తో కలిసి ఇటీవల సమీరా రెడ్డి ఒక బహిరంగ వేడుకలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఇంతలో అక్కడున్న జనం మధ్య తోపులాట జరగి, ఆ రగడ కాస్తా పెరగడంతో బీహార్ వాసులు తమ తడాకా చూపించారు. వెంటనే స్టేజీ మీదకు రాళ్ల వర్షం కురిపించి, అక్కడున్న ఫర్నీచర్ ను ద్వంసం చేశారు.
ఊహించని ఈ సంఘటనతో బిత్తరపోయిన సమీరా రెడ్డి వెంటనే కుర్చీ వెనుక నక్కి, రాళ్ల దెబ్బలు తగలకుండా తనని తాను కాపాడుకునేందుకు ఆ కుర్చీనే అడ్డు పెట్టుకుని వేదిక దిగింది. అక్కడ్నుంచి నిర్వాహకుల సాయంతో తన కారు వరకు క్షేమంగా చేరుకుని, పరిస్థితి చక్కబడే వరకు కారులోనే ఉండి, తర్వాత గమ్య స్థానానికి బయల్థేరింది. తన జీవితంలోనే ఈ సంఘటన మరచిపోలేనిదని, ఇకపై బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయంగా ఉందని సమీరారెడ్డి అంటోంది.