twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ప్రియురాలికి రాళ్లతో దేహ శుద్ది...

    By Sindhu
    |

    జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల పాట్నాలో గోర పరాభవం ఎదుర్కొన్నారు. భోజ్ పురి నటుడు రవికిషన్ తో కలిసి ఇటీవల సమీరా రెడ్డి ఒక బహిరంగ వేడుకలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఇంతలో అక్కడున్న జనం మధ్య తోపులాట జరగి, ఆ రగడ కాస్తా పెరగడంతో బీహార్ వాసులు తమ తడాకా చూపించారు. వెంటనే స్టేజీ మీదకు రాళ్ల వర్షం కురిపించి, అక్కడున్న ఫర్నీచర్ ను ద్వంసం చేశారు.

    ఊహించని ఈ సంఘటనతో బిత్తరపోయిన సమీరా రెడ్డి వెంటనే కుర్చీ వెనుక నక్కి, రాళ్ల దెబ్బలు తగలకుండా తనని తాను కాపాడుకునేందుకు ఆ కుర్చీనే అడ్డు పెట్టుకుని వేదిక దిగింది. అక్కడ్నుంచి నిర్వాహకుల సాయంతో తన కారు వరకు క్షేమంగా చేరుకుని, పరిస్థితి చక్కబడే వరకు కారులోనే ఉండి, తర్వాత గమ్య స్థానానికి బయల్థేరింది. తన జీవితంలోనే ఈ సంఘటన మరచిపోలేనిదని, ఇకపై బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయంగా ఉందని సమీరారెడ్డి అంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X