Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సంపూర్ణేశ్ బాబు సినిమా కోసం సెల్ టవర్ ఎక్కిన అభిమాని.. మూడు గంటల పాటు హైడ్రామా
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.
కథ అంటూ పెద్దగా చెప్పుకోవానికి ఏం ఉండదు.. ఇదో సరదా కథ. రెండు గంటల పాటు లాజిక్, మ్యాజిక్ ఆశించకుండా ఇది సంపూర్ణేష్ బాబు సినిమా అని ప్రిపేర్ అయితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చని రివ్యూవర్లు చెప్పారు. దీంతో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. సినిమా చూసి వచ్చిన వాళ్లు హాయిగా నవ్వుకున్నామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఓ వ్యక్తి సినిమా కోసం సెల్ టవర్ ఎక్కి భయబ్రాంతులకు గురి చేశాడు. వివరాల్లోకి వెళితే..
మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన రెడ్డెప్ప అనే యువకుడు శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా 'కొబ్బరి మట్ట'ను తమ ఊరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ను కోరాడు. అయితే, అది జరగకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడిని కిందికి దించే ప్రయత్నం చేసినా విఫలమయింది.
దీంతో మూడు గంటల పాటు రెడ్డెప్ప టవర్ పైనే ఉన్నాడు. చివరకు అతడి తమ్ముడిని టవర్ పైకి ఎక్కించారు పోలీసులు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెడ్డెప్ప, అతడి తమ్ముడి మాటలు వినడంతో కిందికి దిగాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కిందికి వచ్చిన రెడ్డెప్ప మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించిన పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకువెళ్లారు.