Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సంపూ డైలాగు వింటే షాక్: ‘కొబ్బరిమట్ట’ చిత్రం టీజర్ (వీడియో)
హైదరాబాద్: హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్గా మారిన క్రేజీ హీరో కమ్ కమెడీయన్ సంపూర్ణేష్ బాబు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న సంపూ ప్రస్తుతం కొబ్బరి మట్ట చిత్రంతో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం టీజర్ విడుదలైంది. ఇందులో సంపూ పెదరాయుడు గెటప్లో కనిపించారు. ఆడజన్మకు అర్థం చెబుతూ 'కడుపులో ఆడబిడ్డ అని తెలిసి...' అంటూ ఓ పెద్ద డైలాగ్ విసిరాడు.
కొబ్బరి మట్ట చిత్రంలో మూడు పాత్రలను పోషిస్తున్న సంపూ పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా కనిపించనున్నాడు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కమ్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'హృదయకాలేయం'తో కవ్వించిన సంపూ మరి ఈ చిత్రంతో ఎలా అలరించనున్నాడో వేచి చూడాలి.
ఈ రోజే సాయి ధరమ్ తేజ్ చేతులు మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. . ఈ చిత్రంలో ఆండ్రాయుడు, పాపారాయుడు, పెదరాయుడు అనే మూడు విభిన్న పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. అమృత ప్రొడక్షన్స్, ఆది కుంబగిరిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు 'భద్రం బీకేర్ఫుల్ బ్రదరూ', 'బావురబిల్లి', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్', 'వినోదం 100%' చిత్రాల్లో నటిస్తున్నారు.