Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ చెల్లికి చిగురిస్తోన్న ఆశలు?
తెలుగులో సినిమాలు చేయాలని ఇతర భాషలకు చెందిన చాలామంది హీరోయిన్లు ఎంతో ముచ్చటపడుతుంటారు. శిక్షన పరంగా బాగా చూసుకోవడమే కాదు మంచి పారితోషికం ఇస్తారని, ఓ ప్లానింగ్ ప్రకారం ఇక్కడి దర్శక, నిర్మాతలు సినిమాలను తీస్తారని వారెన్నో సందర్భాలలో కితాబునిస్తుంటారు కూడా. తమిళ కథానాయిక సంధ్య 'ప్రేమిస్తే' అనే అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంతో తెలుగు పరిశ్రమను కూడా ఆమె ఆకర్షించడంతో 'అన్నవరం' చిత్రంలో పవన్కల్యాణ్కు చెల్లెలుగా నటించే అవకాశం కూడా వచ్చింది. క్రేజీ హీరోకు చెల్లెలి పాత్ర కావడంతో ఆమె అందులో నటించింది కూడా. అయితే ఆ తరువాత చెల్లెలి పాత్రలే వస్తాయన్న ఉద్దేశంతో ఇకపై హీరోయిన్గానే నటిస్తానని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో 'నువ్వే నా సఖి' అనే చిత్రంలో హీరోయిన్గా ఆమెకు అవకాశం లభించింది. తెలుగులో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన కన్మణి ఆ చిత్రానికి దర్శకుడు. అయితే ఆ చిత్రం విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. దాంతో తెలుగులో పైకి రావాలనుకున్న సంధ్యకు టెన్షన్ పట్టుకుంది. అయితే 'హాసిని' చిత్రంలో టైటిల్ పాత్రలో మరో చిత్రం రావడంతో ఆమెకు కెరీర్ మలుపుపై ఆశలు చిగురించాయి. 'నువ్వే నా సఖి' చిత్రానికి వేరే టైటిల్ను పెట్టేపనిలో ఉన్నారని, ఈ రెండు చిత్రాలు విడుదలైతే తన కెరీర్ స్పీడ్ అందుకుంటుందని సంధ్య ఎంతగానో ఆశిస్తోంది.