Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ న్యూస్ : రామ్ చరణ్ కి విలన్ గా సంజయ్ దత్ ఖరారు
ముంబై : మొత్తానికి రామ్ చరణ్ కి విలన్ గా చేయటానికి సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ 1973లో నటించిన హిందీ చిత్రం 'జంజీర్'. ఇప్పుడు ఆ చిత్రాన్ని పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే రామ్చరణ్ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈ కథలో కీలక పాత్ర షేర్ఖాన్. నాటి చిత్రంలో ఆ పాత్రను ప్రాణ్ పోషించారు. నేటి షేర్ఖాన్గా నటించమని సంజయ్ దత్ని దర్శకుడు కోరారు. అయితే సంజయ్ కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయారు. ఇటీవల మరోసారి సంప్రదించడంతో నటించేందుకు పచ్చ జెండా వూపారు.
ఒకప్పుడు సంచలనాలు సృష్టించిన 'జంజీర్' సినిమా మళ్లీ రీమేక్ అవుతూండటంతో అందరిలో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా తర్వాత అమితాబ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. యాంగ్రీ యంగ్మేన్ అంటూ అమితాబ్ను పిలవడం ప్రారంభించారు. అమితాబ్ పాత్రకు అంతగా గుర్తింపు రావడానికి కారణం ప్రత్యర్థిగా కనిపించే షేర్ఖాన్ పాత్రను ప్రాణ్ అంతగా రక్తికట్టించడమే. ఒకప్పటి జంజీర్లో ప్రధానంగా కనిపించే పాత్రలు రెండు. ఒకటి విజయ్ (అమితాబ్), రెండు షేర్ఖాన్(ప్రాణ్).
బాలీవుడ్ సినీ చరిత్రలో షేర్ఖాన్ పాత్రకు అంతటి ప్రాధాన్యం దక్కిం దంటే జంజీర్ కథలో ఆ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రాముఖ్యత ఉన్న షేర్ఖాన్ పాత్రలో ఇప్పుడు సంజయ్ దత్ కనిపించటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఒకప్పటి జంజీర్లో ప్రాణ్, అమితాబ్తో పోటీ పడి నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశా డు. అయితే తాజా జంజీర్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. షేర్ఖాన్ పాత్రకు సంజయ్ పూర్తి న్యాయం చేస్తాడని అనుకున్నా విజయ్ పాత్రలో రాంచరణ్ కనిపించడం సంజయ్ కి పోటీగా నిలవటం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలంటున్నారు.
ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తారు. తెలుగు వెర్షన్లో షేర్ఖాన్గా సోను సూద్ కనిపిస్తారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వెర్షన్ కు గానూ యోగి డైరక్ట్ చేస్తున్నారు. 'జంజీర్' చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. అయితే తెలుగు మార్కెట్పై, డబ్బింగ్ కార్యక్రమాలపై హిందీ దర్శకుడైన అపూర్వ లకియా, అక్కడి నిర్మాతలకు అంతగా అవగాహన లేక పోవడం వల్ల డ ఆ బాధ్యతలను పర్ఫెక్టుగా నిర్మహించే బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు యోగికి అప్పగించారు. జంజీర్ చిత్రం తెలుగు వెర్షన్కు సంబంధించిన పనులన్నీ ఈయనే చూస్తున్నారు.