Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ జైలు గూటికి సంజయ్, గేటు వరకు వచ్చిన భార్య
ఈ సారి దీపావళి పండగను సంజయ్ దత్ జైల్లో తన సహచర ఖైదీలతో కలిసి జరుకోనున్నాడు. కాగా...సంజయ్ దత్ పెరోల్ పై బయటకు వచ్చిన తర్వాత అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అతనికి క్షమాబిక్ష లభించే అవకాశం ఉందని, అదే జరిగితే జైలు జీవితం తప్పే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.
అయితే ఈ రూమర్లకు మహారాష్ట్ర హోం మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గత శుక్రవారం తెరదించారు. సెంట్రల్ గవర్నమెంటు నుంచి క్షమాబిక్షకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసారు. సంజయ్ దత్ ఫ్యామిలీ కూడా క్షమాబిక్ష గురించి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేసారు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.