Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కష్టపడి పవన్ కోసం రాసుకున్న కథ ఆ హీరో వద్దకు..కుదరదని చెప్పడంతో!
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడైపోయాడు. ఇక పూర్తి స్థాయిలో ప్రజా జీవితం గడిపేందుకు సిద్ధం అవుతున్నాడు. జనసేన కార్యకర్తలకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమే కానీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు మాత్రం నిరాశ కలిగించే అంశం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలియందే. సంతోష్ శ్రీనివాస్ ఈ మేరకు ఓ కథని కూడా రెడీ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో మరో సినిమా చేసే ఉద్దేశం లేదని సంతోష్ శ్రీనివాస్ తేల్చి చెప్పేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా సంతోష్ శ్రీనివాస్ మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ జనసేనానిగా బిజీ
పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పార్టీ కార్యక్రమాలతో, రాజకీయ కార్యకలాపాలతో బిజీ అయిపోయాడు. దీనితో పవన్ కళ్యాణ్ కు మరో సినిమా చేసే ఉద్దేశం లేదని స్పష్టం అయిపోయింది.
ఎదురుచూస్తున్న సంతోష్ శ్రీనివాస్ కు కూడా
పవన్ కోసం కథ రెడీ చేసుకుని ఎదురుచూస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు కూడా పవన్ ఈ విషయాన్ని చెప్పాడట. రాజకీయ కార్యక్రమాలతో బిజీకాబోతున్నే నేపథ్యంలో సినిమా చేసే టైం లేదని పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ కు చెప్పాడట.
హీరో దొరికాడు
పవన్ నుంచి స్పందన రావడంతో సంతోష్ శ్రీనివాస్ మరో హీరోని వెతుక్కున్నాడు. హీరో గోపీచంద్ తో సంతోష్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కథేనా
కాకపోతే సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రం చేయబోయేది పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసుకున్న కథతోనా లేక వేరే కథతోనా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
ఉగాది సందర్భంగా
తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మార్చ్ 18 న సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.