Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కష్టపడి పవన్ కోసం రాసుకున్న కథ ఆ హీరో వద్దకు..కుదరదని చెప్పడంతో!
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడైపోయాడు. ఇక పూర్తి స్థాయిలో ప్రజా జీవితం గడిపేందుకు సిద్ధం అవుతున్నాడు. జనసేన కార్యకర్తలకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమే కానీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు మాత్రం నిరాశ కలిగించే అంశం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలియందే. సంతోష్ శ్రీనివాస్ ఈ మేరకు ఓ కథని కూడా రెడీ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో మరో సినిమా చేసే ఉద్దేశం లేదని సంతోష్ శ్రీనివాస్ తేల్చి చెప్పేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా సంతోష్ శ్రీనివాస్ మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ జనసేనానిగా బిజీ
పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పార్టీ కార్యక్రమాలతో, రాజకీయ కార్యకలాపాలతో బిజీ అయిపోయాడు. దీనితో పవన్ కళ్యాణ్ కు మరో సినిమా చేసే ఉద్దేశం లేదని స్పష్టం అయిపోయింది.
ఎదురుచూస్తున్న సంతోష్ శ్రీనివాస్ కు కూడా
పవన్ కోసం కథ రెడీ చేసుకుని ఎదురుచూస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు కూడా పవన్ ఈ విషయాన్ని చెప్పాడట. రాజకీయ కార్యక్రమాలతో బిజీకాబోతున్నే నేపథ్యంలో సినిమా చేసే టైం లేదని పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ కు చెప్పాడట.
హీరో దొరికాడు
పవన్ నుంచి స్పందన రావడంతో సంతోష్ శ్రీనివాస్ మరో హీరోని వెతుక్కున్నాడు. హీరో గోపీచంద్ తో సంతోష్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కథేనా
కాకపోతే సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రం చేయబోయేది పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసుకున్న కథతోనా లేక వేరే కథతోనా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
ఉగాది సందర్భంగా
తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మార్చ్ 18 న సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.