twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శారదకు 'చిత్తూరు నాగయ్య' పురస్కారం

    By Srikanya
    |

    ప్రముఖ నటి శారదకు 'పద్మశ్రీ' చిత్తూరు వి.నాగయ్య పురస్కార ప్రదానం జరిగింది. శనివారం రాత్రి ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడుతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిభావంతులైన సీనియర్ సినీ ప్రముఖులు ఒకరికి ఈ అవార్డు బహూకరిస్తున్నారు.

    ఈ ఏడాదికి ఈ పురస్కారాన్ని శారదకు ప్రదానం చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సీనియర్ నటీమణి అంజలీదేవి శారదను ఘనంగా సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలనాటి నటీమణులు రాజసులోచన, గీతాంజలి, ప్రభ, వై.విజయ, సచ్చు, ప్రముఖ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, మురారి, గాయనీమణులు పి.సుశీల, జానకి తదితరులు పాల్గొన్నారు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X