Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరుణ్ సందేశ్ ‘సరదాగా అమ్మాయితో’ జూన్ 14న
హైదరాబాద్ : శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నిర్మించిన 'సరదాగా అమ్మాయితో' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పి. భానుశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పత్తికొండ కుమారస్వామి నిర్మించారు.
ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించాడని, పాటలు, చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాత కుమారస్వామి తెలిపారు. నిర్మాత బడ్జెట్ గురించి ఆలోచించక ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడిగా అవకాశమిచ్చారని, హీరోహీరోయిన్లిద్దరూ చక్కగా పనిచేయడంతో తర్వాత చిత్రం కూడా వాళ్లతో చేయాలనిపించిందని, సినిమా హిట్ అయి అందరికీ మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నానని చిత్ర దర్శకుడు భానుశంకర్ తెలిపారు.
ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రూపొందించడం విశేషం. మరి నిర్మాతలు ఏ మేరకు గట్టెక్కుతారో చూడాలి. కె.విశ్వనాథ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ, రావు రమేష్, కృష్ణ్భగవాన్, రాజేశ్వరి నాయర్, సురేఖవాణి, మాస్టర్ నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: పత్తికొండ రాజ్యలక్ష్మి, పాటలు: సాహితి, చంద్రబోస్, సురేంద్ర కృష్ణ, శ్రీమణి, శ్రీవల్లి, శ్రీనివాస్ ముక్కామల, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: సాయిశ్రీనివాస్, సంగీతం: రవివర్మ, నిర్మాత: పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం: భానుశంకర్ పి.