twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ ‘సరదాగా అమ్మాయితో’ జూన్ 14న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నిర్మించిన 'సరదాగా అమ్మాయితో' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పి. భానుశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పత్తికొండ కుమారస్వామి నిర్మించారు.

    ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించాడని, పాటలు, చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాత కుమారస్వామి తెలిపారు. నిర్మాత బడ్జెట్ గురించి ఆలోచించక ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడిగా అవకాశమిచ్చారని, హీరోహీరోయిన్లిద్దరూ చక్కగా పనిచేయడంతో తర్వాత చిత్రం కూడా వాళ్లతో చేయాలనిపించిందని, సినిమా హిట్ అయి అందరికీ మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నానని చిత్ర దర్శకుడు భానుశంకర్ తెలిపారు.

    ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రూపొందించడం విశేషం. మరి నిర్మాతలు ఏ మేరకు గట్టెక్కుతారో చూడాలి. కె.విశ్వనాథ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ, రావు రమేష్, కృష్ణ్భగవాన్, రాజేశ్వరి నాయర్, సురేఖవాణి, మాస్టర్ నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: పత్తికొండ రాజ్యలక్ష్మి, పాటలు: సాహితి, చంద్రబోస్, సురేంద్ర కృష్ణ, శ్రీమణి, శ్రీవల్లి, శ్రీనివాస్ ముక్కామల, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: సాయిశ్రీనివాస్, సంగీతం: రవివర్మ, నిర్మాత: పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం: భానుశంకర్ పి.

    English summary
    Varun Sandesh, Nisha Aggarwal starrer Saradaga Ammayilatho is finally gearing up for release on June 14. The film has been directed by Bhanu Shankar and Patthikonda Kumaraswamy is producing it. Charmee is playing a special role and she’ll be seen in the second half of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X