Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
రేపటి నుంచి పవన్ రంగంలోకి...
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నార. రీసెంట్ గా 'సర్దార్' ఫస్ట్లుక్,టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ గ్యాప్ తీసుకున్న ఈ టీమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వనున్నారు. విలన్స్ లో ఒకరుగా కనిపించనున్న కబీర్ దుహ సింగ్ కు, పవన్ కు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మరిన్ని విశేషాలకు వెళ్తే...
పవన్ కల్యాణ్ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్ సింగ్'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ పోలీస్ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా శరత్ మరార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్సింగ్ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు'సర్దార్ గబ్బర్ సింగ్' పెట్టి ఫస్ట్ లుక్ వదిలారు.
ఈ కొత్త షెడ్యూలుతో పవన్ కల్యాణ్ రంగ ప్రవేశం చేసారు, ఆయనపైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. హీరోయిన్ గా కాజల్ ని నిర్ణయించినట్లు సమాచారం.
నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్సింగ్'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.
'గబ్బర్ సింగ్ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్ సింగ్ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్ కేల్కర్. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్సింగ్ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.
ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్లు చేసి.. చివరికి పవన్ కేల్కర్ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్ నటన పట్ల పవన్ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.
కేల్కర్ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్మరార్ నిర్మాత.
నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, కెమెరా: జయనన్ విన్సెంట్.