Don't Miss!
- News విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Sports ఓటమి తర్వాత రోహిత్తో ఫ్రాంచైజీ చర్చలు.. హార్దిక్పై వేటు!
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు.. ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ.. రియల్లీ సరిలేరు నీకెవ్వరు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మహర్షి లాంటి భారీ సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా అప్డేట్స్ ద్వారా నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నారు మహేష్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వివరాలు తెలిపి అభిమానుల్లో జోష్ నింపారు. వివరాల్లోకి పోతే..
షూటింగ్ ప్రారంభం నుంచే ఆసక్తి రేపుతూ..
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రారంభం నుంచే ఆసక్తిరేపే అప్డేట్స్ ఇస్తూ వచ్చారు యూనిట్ సభ్యులు. ఎప్పటికప్పుడు మహేష్ ఫ్రెష్ లుక్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన అభిమానులకు స్పెషల్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ సంక్రాంతికి మహేష్ హంగామా ఫుల్లుగా ఉంటుందని ఫిక్సయ్యారంతా. ఈ ఎఫెక్ట్తో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
మహేష్ కోరిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్
ఇక 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక కూడా అట్టహాసంగా అశేష అభిమాన వర్గం నడుమ జరగాలని మొదటి నుంచే మహేష్ చెబుతూ వస్తున్నారట. ఆయన కోరిక మేరకు ఈ వేడుకకు భారీ వేదిక సిద్ధం చేశారు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.
తారల సందడి మిన్నంటేలా ఏర్పాట్లు
జనవరి 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ వేడుకలో తారల సందడి మిన్నంటేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఇక మహేష్ ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ అంటున్నారు.
మహేష్ బాబు, రష్మిక మందన్న రొమాన్స్
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
హీ ఈజ్ సో క్యూట్..
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందింది. అందరూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్ ` హీ ఈజ్ సో క్యూట్`ను ఈ రోజు (డిసెంబర్ 16) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.