twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రెస్టింగ్: ట్రైన్‌లో మహేష్ బాబు.. లవ్ గుర్తులు చూపిన రష్మిక మందన్న

    |

    'మహర్షి' లాంటి భారీ సక్సెస్‌ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారభించుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్‌లో మహేష్ బాబు లుక్ పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. ఈ ట్వీట్ చూసిన రష్మిక మందన్న ఎలా రియాక్ట్ అయ్యిందంటే..

    కొదవే లేని కామెడీ

    కొదవే లేని కామెడీ

    సాధారణంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీని కొదవే ఉండదు. థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఆయన స్టయిలే వేరు. ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 సినిమా ద్వారా తన కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందనేది పక్కాగా నిరూపించారు అనిల్ రావిపూడి. అయితే అదే తరహాలో తన రెగ్యులర్ పంథాలోనే 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా కామెడీ పండించనున్నారు అనిల్.

     కాశ్మీర్ టు ఆంధ్ర.. ఫుల్ జోష్

    కాశ్మీర్ టు ఆంధ్ర.. ఫుల్ జోష్

    మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేసిన అనిల్ రావిపూడి.. మహేష్ బాబు కాశ్మీర్ నుంచి ఆంధ్రకు వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. కాశ్మీర్ టు ఆంధ్ర ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

    మహేష్ షాడో లుక్ రివీల్.. అనిల్ ట్వీట్

    మహేష్ షాడో లుక్ రివీల్.. అనిల్ ట్వీట్

    తాజాగా ఈ ట్రైన్ ఎపిసోడ్ కి సంబంధించి మహేష్ బాబు లుక్ రివీల్ చేశాడు అనిల్. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. 'రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హిలేరియస్ ట్రైన్ కామెడీ సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది. సిద్ధంగా ఉండండి.. సూపర్‌స్టార్ మిమ్మల్ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేయనున్నాడు' అని పేర్కొన్నాడు.

    రష్మిక మందన్న రియాక్షన్

    డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ఈ ట్వీట్ పై హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. అనిల్ చేసిన ఆ ట్వీట్, మహేష్ షాడో ఇమేజ్ ట్యాగ్ చేస్తూ లవ్ గుర్తులు ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో రష్మిక రక్షణ్ చూసి మహేష్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మహేష్ తో వర్క్ ఫీలింగ్ ఎలా ఉందంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

    మహేష్.. సరిలేరు నీకెవ్వరు

    మహేష్.. సరిలేరు నీకెవ్వరు

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

    English summary
    Mahesh Babu's 26th movie SariLeru Neekevvaru which is directed by Anil Ravipudi. In this movie the train Commedy track will be hilight as per latest talk in filmnagar. In this movie Vijayashanti playing lead role after 15 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X