Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మాజీ హీరోయిన్ సరిత పై భర్త కుట్ర
చెన్నై : అలనాటి హీరోయిన్ సరితకు ఆమె భర్త నుంచి సమస్యలు మొదలయ్యాయి. తనపై కుట్ర పన్నుతున్నారంటూ ఆమె ఆరోపించారు. తన సహ నటుడు ముఖేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే మండిపడుతున్నారు. మనస్పర్దలు వచ్చి విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్న వీరు... విడాకులకై కేరళలోని ఎర్నాకులం ఫ్యామిలీ వెలఫేర్ కోర్ట్ లో పిటీషన్ ధాకలు చేసారు. ఆగస్టు 27,2014కి ఈ కేసుని మెజిస్టేట్ వాయిదా వేసారు.
అయితే ఈ కేసు వ్యవహారంలో తనకు నోటీసులు సక్రమంగా అందటం లేదని, అందులో తన భర్త పాత్ర ఉందనే అనుమానం ఉందంటూ ఆరోపణలు చేసారు. వివాహ రద్దు విషయంలో తన వాదన వినిపించటానికి తగిన సమయం కేటాయించటం లేదని ఆమె వాపోయారు.
చట్టవిరుద్ధంగా తన భర్త (మలయాళ నటుడు ముఖేష్) రెండో వివాహం చేసుకున్నారని.. ఆయనపై కేసు పెట్టనున్నట్లు సినీనటి సరిత పేర్కొన్నారు. మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు. అభిప్రాయభేదాల కారణంగా తాను, భర్త వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలిపారు.
తన మొదటి కుమారుడు షర్వన్ దుబాయ్లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడని వివరించారు. వారికి తోడుగా తాను కూడా అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాను ముఖేష్పై కేసు పెట్టానని తెలిపారు.
సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్ మాధవన్తో కేరళలో సరిత వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత. ఈ లోగా విడాకులకై అప్లై చేసారు.