Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్.. ఆ విషయంలో ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక మోషన్ పోస్టర్ ని విదుదల చేసింది. అయితే సర్ ప్రైజ్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కొంత వరకు నిరాశకు గురి చేసింది. మహేష్ ఫేస్ చూపించకుండా పరవాలేదు అనిపించే విధంగా ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు.
అందుకే ఆలస్యం..
సర్కారు వారి పాట సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కథను ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆ మధ్య రిలీజ్ చేసిమ టైటిల్ ఫస్ట్ పోస్టర్ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. కానీ అందులో మహేష్ ని చూపించలేదు.
తెలివిగా సర్ ప్రైజ్ ఇచ్చారు
ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో అయినా మహేష్ లుక్ రివీల్ చేస్తారేమో అనుకుంటే మళ్ళీ తెలివిగా సర్ ప్రైజ్ ఇచ్చారు. మహేష్ రూపాయి కాయిన్ ని ఎగురవేస్తున్నట్లు ఉన్న ఆ మోషన్ పోస్టర్ లో చేయి తప్ప ఫేస్ కనిపించలేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ముందే చూపిస్తే కిక్కెముంటుంది?
అప్డేట్ అయితే ఇచ్చారు గాని మహేష్ ని చూపించలేదు అని ట్రోలింగ్స్ గట్టిగానే వస్తున్నాయి. అయితే సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ముందే చూపిస్తే భవిష్యత్తులో కిక్కు మిస్ అవుతుందని మరికొందరు అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. ఎలాంటి కామెంట్స్ వచ్చినా కూడా SVP లుక్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Recommended Video
పాన్ ఇండియా రేంజ్ లో..
ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్న విషయం తెలిసిందే.