Don't Miss!
- News పవన్ కల్యాణ్ అఫిడవిట్లో ఏముంది?
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఆ సినిమాకి సెన్సార్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు
ఈ చిత్రం పేరు 'కంగల్ మల్సాట్' . ఈ చిత్రానికి సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించారు. మహాశ్వేతాదేవి కుమారుడు నబరూన్ భట్టాచార్య రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. మమత సిఎంగా ప్రమాణం చేసిన దృశ్యాలను వ్యంగ్యంగా చిత్రీకరించారు. ఇది బెంగాలీల సెంటిమెంట్లనుగాయపరచవచ్చని సెన్సార్ బోర్డు చిత్ర నిర్మాతలకు రాసిన లేఖలో తెలిపింది. అందువల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇక రీసెంట్ గానే.. సెన్సార్ బోర్డు తీరుపై 'జబర్దస్త్' చిత్ర దర్శకురాలు నందినీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నందినీరెడ్డి మాట్లాడుతూ...'విశ్వరూపం' చిత్రం కాంట్రవర్సీ తర్వాత సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ 'అల్లా అల్లా' పదంలో ముస్లింలను కించ పరిచే విధంగా ఏముందో నాకు అర్థం కావడం లేదు. సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయాల వల్ల సినిమా స్వేచ్ఛ హరించ బడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ప్రపంచం చీకటి యుగాలకు వెలుతుంది.' అని ఆమె అభిప్రాయ పడ్డారు.
'అదే విధంగా సినిమాలో చాలా డైలాగులను తొలగించారు. సెన్సార్ బోర్డు తీరు మరీ దారుణంగా ఉంది. సినిమాలు ఎలా తీయాలో, ఎలాంటి పదాలు వాడకూడదో, ఎలాంటి పదాలు వాడాలో స్పష్టం వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు వారు ఓ టెక్ట్స్ బుక్ రిలీజ్ చేస్తే బాగుటుంది' అంటూ నందినీరెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేగాక ఈ మధ్యన ఓ దర్శకుడు సెన్సార్ బోర్డ్ ఎదురుగా ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు.