Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆ సినిమాకి సెన్సార్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు
ఈ చిత్రం పేరు 'కంగల్ మల్సాట్' . ఈ చిత్రానికి సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించారు. మహాశ్వేతాదేవి కుమారుడు నబరూన్ భట్టాచార్య రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. మమత సిఎంగా ప్రమాణం చేసిన దృశ్యాలను వ్యంగ్యంగా చిత్రీకరించారు. ఇది బెంగాలీల సెంటిమెంట్లనుగాయపరచవచ్చని సెన్సార్ బోర్డు చిత్ర నిర్మాతలకు రాసిన లేఖలో తెలిపింది. అందువల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇక రీసెంట్ గానే.. సెన్సార్ బోర్డు తీరుపై 'జబర్దస్త్' చిత్ర దర్శకురాలు నందినీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నందినీరెడ్డి మాట్లాడుతూ...'విశ్వరూపం' చిత్రం కాంట్రవర్సీ తర్వాత సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ 'అల్లా అల్లా' పదంలో ముస్లింలను కించ పరిచే విధంగా ఏముందో నాకు అర్థం కావడం లేదు. సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయాల వల్ల సినిమా స్వేచ్ఛ హరించ బడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ప్రపంచం చీకటి యుగాలకు వెలుతుంది.' అని ఆమె అభిప్రాయ పడ్డారు.
'అదే విధంగా సినిమాలో చాలా డైలాగులను తొలగించారు. సెన్సార్ బోర్డు తీరు మరీ దారుణంగా ఉంది. సినిమాలు ఎలా తీయాలో, ఎలాంటి పదాలు వాడకూడదో, ఎలాంటి పదాలు వాడాలో స్పష్టం వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు వారు ఓ టెక్ట్స్ బుక్ రిలీజ్ చేస్తే బాగుటుంది' అంటూ నందినీరెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేగాక ఈ మధ్యన ఓ దర్శకుడు సెన్సార్ బోర్డ్ ఎదురుగా ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు.