twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూన్ 14న ' సత్యమేవ జయితే' ప్రారంభం

    By Staff
    |

    Rajasekhar
    మరోసారి రాజ్ శేఖర్ పోలీస్ పాత్రలో కనపడనున్నాడు.బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఖాకీ' సినిమా ఇప్పుడు తెలుగులో 'సత్యమేవ జయతే' పేరుతో రీమేక్ కాబోతోంది. అందులో అమితాబ్ బచ్చన్ చేసిన పోలీసాఫీసర్ పాత్రను రాజశేఖర్ పోషించనుండగా, అజయ్ దేవగన్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రను బాలీవుడ్ నటుడు, మోడల్ మిళింద్ సోమన్ చేయనున్నాడు. అసలు రాజశేఖర్ అంటేనే రీమేక్ ల కింగ్. ఆయన డైరక్ట్ గా చేసిన సినిమాల కన్నా రీమేక్ లే బాగా ఆడాయి. అలాగే పోలీసు పాత్ర అన్నా ఆయనే గుర్తు రావటం మరో విశేషం. రాజశేఖర్ కెరీర్ లో పెద్ద హిట్ సినిమా ఐన 'అంకుశం' లో ఆయన పోలీస్ ఆఫీసరుగా కన్పించి అదరకొట్టారు. ఆ తరువాత ఆ తరహాలో ఆయన చేసిన సినిమాలన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి.

    అలాగే ఇక కెరీర్ ముగిసిపోతోందనుకున్న దశలో చేసిన 'ఎవడైతే నాకేంటి' పోలీసులకు సపోర్టు ఇచ్చే హోం మినిస్టర్ పాత్ర. అదీ మంచి హిట్టైంది. రాజశేఖర్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను ఆయన భార్య జీవిత స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్నారు. దాంతో ఆయన 'సత్యమేవ జయతే' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా మొదలు కాక మునుపే ఇద్దరు నిర్మాతలు మారారు. అందుకే సొంత బానర్ అయిన ఆండాళ్ ఆర్ట్స్ కిందే ఈ సినిమాను రాజశేఖర్ దంపతులు నిర్మించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 14న ప్రారంభం కానున్నది. కాగా ఈ సినిమా ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X