Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిమ్మతిరిగేలా సవ్యసాచి బిజినెస్.. చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్.. క్రేజీ ప్రాజెక్ట్గా..
శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ జోష్తో నాగచైతన్య మరోసారి సవ్యసాచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్కు ట్రిపుల్ బ్లాక్బస్టర్లను అందించిన మైత్రీ మూవీస్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2 తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నది. కార్తీకేయ, ప్రేమమ్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ క్రేజీగా జరుగడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్
శైలజారెడ్డి అల్లుడు విజయంతో నాగచైతన్య కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా సవ్యసాచి మూవీ బిజినెస్ జరిగింది. ఓవరాల్గా ఈ చిత్రం రూ.22.32 కోట్ల ప్రీ బిజినెస్ రిలీజ్ జరగడం గమనార్హం.
ట్రాన్స్జెండర్గా మారిన జబర్దస్త్ సాయి తేజ, చావు దగ్గరి వరకు వెళ్లి....
Recommended Video
దిల్ రాజుకు నైజాం హక్కులు
సవ్యసాచి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. రూ.6 కోట్లకు ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులను దక్కించుకొన్నారు. ఇక సీడెడ్లో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ పంపిణీ చేస్తున్నారు. సీడెడ్ హక్కులను రూ.3.2 కోట్లకు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.
ఉత్తరాంధ్రలో హక్కులను
ఉత్తరాంధ్రలో సవ్యసాచి చిత్రాన్ని గాయత్రి డిస్టిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర హక్కులను రూ.2.2 కోట్లకు దక్కించుకొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓం మణికంఠ రూ.1.4 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్వీఆర్ రూ.1.1 కోట్లకు హక్కులను సొంతం చేసుకొన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలోని
కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికి వస్తే కేఎఫ్సీ నవీన్ రూ.2.8 కోట్లకు, నెల్లూరులో భాస్కర్ రూ.0.72 కోట్లకు హక్కులను సొంతం చేసుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగితా రాష్ట్రాల థ్రియేట్రికల్ రైట్స్ను రూ.1.6 కోట్లకు అమ్మడం జరిగింది.
ఓవర్సీస్ మార్కెట్లో సవ్యసాచి
ఓవర్సీస్ మార్కెట్లో సవ్యసాచి చిత్రం భారీగా రిలీజ్ అవుతున్నది. ఈడబ్ల్యూ ఎంటర్టైనర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతున్నది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా నిర్మాతలకు రూ.3.5 కోట్లు లభించినట్టు విశ్వసనీయ సమాచారం.
కీరవాణి సంగీత దర్శకత్వంలో
నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సవ్యసాచి చిత్రంలో సీనియర్ నటుడు ఆర్ మాధవన్, భూమిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, భరత్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.