Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగార్జునతో పోటీకి దిగిన సాయాజి షిండే
క్యారెక్టర్ ఆర్టిస్టు సాయాజీ షిండే ఇప్పుడు నాగార్జుతో పోటీ పడటానికి సిద్దం అయ్యారు.నాగార్జున,రాఘవేంద్రరావు కాంబినేషన్ లో త్వరలో షిర్డీ సాయిబాబా చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే.అయితే ఈ లోగా సాయాజీ షిండే తాను కూడా షిర్డి సాయిబాబాగా అవతారం ఎత్తటానికి సిద్దమయ్యారు.రాజవంశీ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయమై షిండే మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. తొలిసారి ఓ ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.