Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో గోవిందా ని క్షమాపణ చెప్పమన్న సుప్రీంకోర్టు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బాధితుడికి క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఈ హీరోకు సూచించింది.
వివరాల్లోకి వెళితే...గోవిందా గతంలో సంతోష్ రాయ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన కేసును ముంబయి హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాయ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జస్టిస్ టి.ఎస్.ఠక్కర్ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో క్లిప్లను పరిశీలించిన తర్వాత గోవిందాకు ఈ సూచన చేసింది. రీల్లైఫ్ లో చేసినట్లు రియల్ లైఫ్లో చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
'మేము మీ సినిమాలను చూసి ఆనందిస్తాం.. కానీ మీరు ఇలా నిజజీవితంలో ఎవరినైనా చెంపదెబ్బ కొడితే హర్షించలేము'అని ఆయన అన్నారు. ప్రజల మనిషిగా ఉండేవారు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోమని సలహా ఇచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశారు.