Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ నిర్మాతల మండలిలో అవినీతి ‘స్కాం’
నిర్మాతల మండలి వారంతో ఓ భీమా సంస్థ ద్వారా.... మండలిలో సభ్యులుగా ఉన్న వారి పేరు మీద పాలసీలు చేసారు. ఏ నిర్మాతకైనా ఆరోగ్య సమస్య వస్తే సదరు భీమా కంపెనీ రూ. 2 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే నిర్మాతల మండలి సమావేశం అయి మండలి తరుపున ఎంత డబ్బు మంజూరు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది.
అయితే కార్యదర్శి ప్రసన్న కుమార్... కొన్ని ఫేక్ రికార్డులు సృష్టించి ఇతర నిర్మాతల పేరుతో డబ్బులు డ్రా చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొందరు నిర్మాతలు సాక్షాలతో సహా నిరూపించారని టాక్. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రసన్న కుమార్ ను ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరం అయితే పోలీస్ కేసు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కార్యదర్శి ప్రసన్న కుమార్ మాత్రం తాను ఏ అవినీతికి పాల్పడలేదని, విచారణలో అన్ని విషయాలు తేలుతాయని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయం ఓ కొలిక్కి రానుంది.