Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్క్రీన్ ప్లే ప్రధానంగా సాయి ధరమ్ తేజ్ చిత్రం
హైదరాబాద్
:
సాయి
ధరమ్
తేజ్
హీరోగా
ఎ
ఎస్
రవికుమార్
చౌదరి
దర్శకత్వంలో
ఈ
చిత్రం
రూపొందుతున్న
సంగతి
తెలిసిందే.
బన్నీ
వాసు
నిర్మిస్తున్న
ఈ
చిత్రానికి
'పిల్లా
నువ్వు
లేని
జీవితం..'.
అనే
టైటిల్
ఖరారు
చేసారు.
దీనికి
అల్లు
అరవింద్,
దిల్రాజు
నిర్మాతలు.
ఆదివారం
ఈ
దర్శకుడి
పుట్టిన
రోజు
ఈ
సందర్భంగా
హైదరాబాద్లో
మీడియాతో
ముచ్చటించారు.
దర్శకుడు మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. ఆ కొత్తదనాన్ని సాయిధరమ్ తేజ్ సినిమాలో చూస్తారు. ఇది స్క్రీన్ప్లేలో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. చాలా భాగం రామోజీ ఫిల్మ్సిటీలోనే తెరకెక్కించాం. ఒకే ఒక్క పైట్ సీన్ మిగిలి ఉంది'' అన్నారు.
ఈనాటి సినీ పోకడల గురించి చెబుతూ... ''ట్రెండ్ని అర్థం చేసుకొని మారాలి. కథ ఎలాంటిదైనా యువతరానికి నచ్చేలా చెప్పాలి. కుటుంబ ప్రేక్షకులూ ముఖ్యమే. వాళ్లంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎలాంటి హింస, అశ్లీలత లేకపోతే తప్పకుండా వారూ.. థియేటర్ల వరకూ వస్తారు. ఇకనుంచి విరామం లేకుండా సినిమాలు తీస్తా. నితిన్ హీరోగా ఓ సినిమా ఉంటుంది. అది వచ్చే యేడాది ఫిబ్రవరిలో మొదలవుతుంది''అన్నారు.