Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అంజలి గొడవకి అసలు కారణం ఇదే??
తెలుగు సినిమాల్లో నటిస్తే అనతి కాలంలోనే ప్రాచుర్యం, అధిక పారితోషికం లభిస్తుందని గుర్తించిన అంజలి తన పిన్ని, బాబాయ్లతో ఈ విషయమై కొంత కాలం క్రితం చర్చించారు. సీతమ్మ వాకిట్లో హిట్ అవటం..మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావటం దానికి ఊతమిచ్చినట్లైంది. అయితే తమిళ సినిమాల్లో నటిస్తేనే భవిష్యత్తు ఉంటుందని పిన్ని,బాబాయ్ చెప్పడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అప్పటి నుంచి అంజలి వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
ఈ క్రమంలోనే డబ్బింగ్ సినిమాల నిర్మాతతో మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పిన్ని, బాబాయ్లు ఆమెను హింసించడం ప్రారంభించారని తెలిసింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వెంట వచ్చిన బాబాయ్ శనివారం ఆమెపై చేయిచేసుకొన్నట్లు సమాచారం. దీంతో వారితో విడిపోవాలని నిర్ణయించుకున్న అంజలి ఆదివారం తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖవ్యక్తుల శరణు కోరింది.
ఒక నిర్మాత సహకారంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమెతో సినిమా ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు తమకు ఇబ్బందులు కలగనీయరాదని సినీపెద్దలకు చెప్పుకోవడంతో గురువారం అజ్ఞాతం వీడాల్సిందిగా ఆమెకు సమాచారం పంపినట్టు తెలిసింది. హైదరాబాద్కు వచ్చి వివరాలు వెల్లడించాల్సిందిగా ఆమెను సంరక్షిస్తున్న నిర్మాతకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంజలి ఆమె సోదరుడు రవిశంకర్తో మరోమారు ఫోన్లో మాట్లాడారు. తనతో పాటు మరొకరున్నారంటూ సోదరుడికి చెప్పినట్టు తెలిసింది. ఆమె సోదరుడు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించారు.
తక్షణం హైదరాబాద్కు రావాలన్న పోలీసుల సూచనను సోదరుడు అంజలికి చేరవేయటంతో ఆమె అజ్ఞాతం వీడి హైదరాబాద్కు బయలు దేరినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం పోలీసుల సమక్షంలో అంజలి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నందున అంజలి ప్రస్తుతం ఎక్కడున్నది తెలియటంలేదు. అయితే ఆమె క్షేమ సమాచారాన్ని, రాకను డీసీపీ జి.సుధీర్బాబు ధ్రువీకరించారు.