Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొబ్బరి తోటలో మహేష్,సమంత పెళ్ళి
హైదరాబాద్ : చెన్నై శివారు కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి మహేష్,సమంత పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.వెంకటేష్, మహేష్బాబు, సమంత, అంజలి కాంబినేషన్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. చలి పులి పంజా విసిరే సమయంలో సందడి చేసేందుకు వెంకటేష్, మహేష్బాబు సన్నద్ధమవుతున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...''పదహారణాల తెలుగుదనాన్ని ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రమిది. ఇటీవలే చెన్నైలో పెళ్లి పాటతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్సిటీలో కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ భారీ సెట్ నిర్మించాం. అక్కడ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల్ని త్వరలో చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో అయిదు పాటలున్నాయి. ఇప్పటికే మూడింటిని చిత్రీకరించాం. నవంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.
అలాగే 'నేను' అనే భావనే తప్ప 'మనం' అనుకునే విశాల దృక్పథం ఇప్పుడు కొరవడిపోయింది. చివరకు తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటికి అతిథులుగా రావాల్సిన దుస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబానికి అర్థం చెప్పేవారే ఉండరు. ఇలాంటివన్నీ గుర్తుచేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం'' అని 'దిల్'రాజు చెప్పారు. అలాగే ..."మనం అని అనుకునే విశాల దృక్పథం పోయింది. అమ్మానాన్నలు కూడా పిల్లల ఇంటికి అతిథులుగానే వస్తున్నారు. భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబానికి అర్థం చెప్పేవారుండరు. కానీ వాటన్నింటినీ గుర్తుచేసే చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తెరకెక్కుతోంది అన్నారు.
కోటి రూపాయలతో రామోజీ ఫిల్మ్సిటీలో ఓ సెట్ను వేశాం. శ్రీకాంత్ చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నాడు. టీజర్ విడులదైనప్పటి నుంచి అంచనాలు పెరిగాయి. వాటిని చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. తెలుగుదనం ఉట్టిపడే సినిమా అవుతుంది. ఇప్పటికి 78 రోజులు షూటింగ్ చేశాం. మరో 30 రోజులు తెరకెక్కించాలి. ప్రకాష్రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి,అభినయ, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుమిత్ అరోరా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రవిబాబు, రమాప్రభ, రజిత, శ్రీనివాస్రెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, మెల్కోటె, వేణు మాధవ్, ఢిల్లీ రాజేశ్వరి, మురళీ మోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత: దిల్ రాజు, సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ.జె.మేయర్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: విజయ్.