Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాని నిర్మాత అరెస్టే..హాట్ టాపిక్
నానితో సెగ చిత్రం తీసిన వల్లభనేని అశోక్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జా కేసులో ఇరుక్కున్న అశోకి్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యారు.టాలీవుడ్ లో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయం తప్పనిసరిగా చర్చ వస్తోంది. ఆ మధ్యన సి కళ్యాణ్,సింగనమల రమేష్ తర్వాత ఇప్పుడు అశోక్ అరెస్టే అంతటా షాక్ కి గురి చేసింది. అందులోనూ ఆయనతో తర్వత సినిమా నిమిత్తం అడ్వాన్స్ లు తీసుకున్న వారు తమ ప్రాజెక్టులు పరిస్ధితి ఏమిటన్న విషయంలో ఆందోళనకు గురి అవుతున్నారు.
ఇక ఎల్లారెడ్డి గూడలో ఓ భూ కబ్జా కేసుకు సంభందించి వల్లభనేని అశోక్ తో సహా పదకొండు మందిని పోలీసులు శనివారం అరెస్టు చేసారు.వారిని చంచలగూడా పోలిస్ స్టేషన్ కి షిప్ట్ చేసారు.అంతేగాక జూబ్లీహిల్స్ లోని ఐదు కోట్లు విలువ చేసే భూమి కోసం నిర్మాత అశోక్ బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇదే నిర్మాత గౌతమ్ మీనన్ డైరక్ట్ చేసిన ఓ చిత్రాన్ని ఎర్ర గులాబీలు పేరుతో తెలుగులోకి డబ్ చేసి వదిలారు.అయితే సెగ,ఎర్ర గులాబీలు రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం ఆయన్ని నిరాశ పరిచిన అంశం.