Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాని నిర్మాత అరెస్టే..హాట్ టాపిక్
నానితో సెగ చిత్రం తీసిన వల్లభనేని అశోక్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జా కేసులో ఇరుక్కున్న అశోకి్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యారు.టాలీవుడ్ లో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయం తప్పనిసరిగా చర్చ వస్తోంది. ఆ మధ్యన సి కళ్యాణ్,సింగనమల రమేష్ తర్వాత ఇప్పుడు అశోక్ అరెస్టే అంతటా షాక్ కి గురి చేసింది. అందులోనూ ఆయనతో తర్వత సినిమా నిమిత్తం అడ్వాన్స్ లు తీసుకున్న వారు తమ ప్రాజెక్టులు పరిస్ధితి ఏమిటన్న విషయంలో ఆందోళనకు గురి అవుతున్నారు.
ఇక ఎల్లారెడ్డి గూడలో ఓ భూ కబ్జా కేసుకు సంభందించి వల్లభనేని అశోక్ తో సహా పదకొండు మందిని పోలీసులు శనివారం అరెస్టు చేసారు.వారిని చంచలగూడా పోలిస్ స్టేషన్ కి షిప్ట్ చేసారు.అంతేగాక జూబ్లీహిల్స్ లోని ఐదు కోట్లు విలువ చేసే భూమి కోసం నిర్మాత అశోక్ బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇదే నిర్మాత గౌతమ్ మీనన్ డైరక్ట్ చేసిన ఓ చిత్రాన్ని ఎర్ర గులాబీలు పేరుతో తెలుగులోకి డబ్ చేసి వదిలారు.అయితే సెగ,ఎర్ర గులాబీలు రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం ఆయన్ని నిరాశ పరిచిన అంశం.