Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫిదా కథ పవన్ కళ్యాణ్ షాడోలా నడిపాడు: షాకిచ్చిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను 'ఫిదా' కథను రాసుకున్నట్టుగా చెప్పి ఆశ్చర్యపరిచారు.
'ఫిదా' చిత్రం, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను ఈ కథను రాసుకున్నట్టుగా చెప్పి ఆశ్చర్యపరిచారు.
పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా
"అసలు ఫిదా సినిమాను పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా. మొదట్నుంచి ఇందులో పవన్ నే ఊహించుకున్నాను. దిల్ రాజుకు కథ చెప్పినప్పుడు కూడా పవన్ అయితే బాగుంటుందని చెప్పాను. కథ రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ కల్యాణ్ తనను నడిపించారని శేఖర్ కమ్ముల తెలిపారు.
Recommended Video
ఖుషి సినిమా ఛాయలు
ఆయన చేసిన ఖుషి సినిమా ఛాయలు, ఫిదా సెకెండాఫ్లో కనిపిస్తాయని తెలిపాడు. అందుకే ఫిదా సినిమాను పవన్ కల్యాణ్తో తీద్దాం అనుకున్నానని శేఖర్ కమ్ముల తెలిపాడు. అయితే పవన్తో ఆ సినిమా చేయలేకపోయానని,.. అయినప్పటికీ వరుణ్ తేజ్ ఫిదాలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఇంతలా పవన్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్న కమ్ముల, ఆ హీరోకు మాత్రం ఈ కథను వినిపించలేదు.
ఇదే కథను రామ్ చరణ్కు
అయితే మరో ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం వినిపించాడనీ వాళ్ళు తిరస్కరించారనీ కొన్ని రూమర్లు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో గానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదట 'ఫిదా' కథను మహేశ్ బాబుకి చెప్పినా ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించాడట. ఇక ఆ తర్వాత ఇదే కథను రామ్ చరణ్కు చెప్పాడట శేఖర్.
హీరోయిన్ డామినేటెడ్ సబ్జెక్ట్
చెర్రీకి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చేసిందట. అయితే హీరోయిన్ డామినేటెడ్ సబ్జెక్ట్గా ఉన్న 'ఫిదా' సినిమా చేయడానికి తన ఇమేజ్ అడ్డుపడుతుందని భావించి కజిన్ వరుణ్ తేజ్కి ఈ చిత్రాన్ని రికమెండ్ చేశాడట. శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో 'ఫిదా' చిత్రాన్ని పూర్తిచేయడం, సూపర్ హిట్ కొట్టడం జరిగిపోయింది.