twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల డేట్ మార్చాడు

    By Staff
    |

    శేఖర్ కమ్ముల ప్రస్తుతం రాణా హీరోగా రూపొందించుతున్న లీడర్ చిత్రం గాంధి జయంతి రోజున (అక్టోబర్ రెండు) రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)రోజున రిలీజ్ కి ప్లాన్ చేసారు కాని షూటింగ్ లేట్ అవటం వల్ల ఈ నిర్ణయం తీసు కోవలసి వచ్చిదని తెలుస్తోంది.

    రామానాయుడు మనవడు..సురేష్ బాబు కుమారుడు అయిన రాణా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని టాక్ వినపిస్తోంది.హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X