Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సినీ నటి బిందు మాధవి కన్నమూత, ‘మా’ సంతాపం
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ నటి బిందు మాధవి శుక్రవారం కన్నమూసారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బిందు మాధవి మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడంతో పాటు, టీవీ సీరియళ్లలో ఆమె నటించారు. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్ సాయం అందజేశారు.
గత కొంత కాలంగా ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆ మధ్య నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చాతి, గుండె సంబంధమైన వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కొంత కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స నిర్వహించారు.
ఆ సమయంలో నటి కవిత కూడా ఆమెను పరామర్శించారు. వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతోందని, సరిపడా డబ్బులు ఆమె వద్ద లేవని, ఆర్థిక సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలనికోరారు. ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ఒంగోలు లోని ఆసుపత్రికి తరలించననట్లు సమాచారం.
అయితే బిందు మాధవి పేరుతో....యువ హీరోయిన్ కూడా ఉంది. ఆమెకు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. సినీ ప్రియులు అమయోమానికి గురి కావాల్సిన అవసరం లేదు.