Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వైఎస్సార్ బయో పిక్: షర్మిల పాత్రలో ఆ హీరోయిన్ ఖరారు!
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రని యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వైఎస్ఆర్ పాత్రని మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదుల చేసిన సంగతి తెలిసిందే. వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వైఎస్ స్నేహితుడు కెవిపి రామచంద్ర రావు పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలోకి మరో కీలక నటి చేరింది. వైఎస్ కుమార్తె షర్మిల పాత్ర కోసం సీనియర్హీరోయిన్ భూమికని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కీలక నటీ నటులతో వైఎస్సార్ బయోపిక్ చిత్రం భారీగా మారుతోంది.
బాహుబలి2 చిత్రంతో గుర్తింపు పొందిన ఆశ్రితి వేముగంటి.. విజయమ్మ పాత్రలో నటించబోతోంది. ఇక జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం తేలాల్సివుంది. వైఎస్సార్ బయోపిక్ చిత్రంతో రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.