Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైఎస్సార్ బయో పిక్: షర్మిల పాత్రలో ఆ హీరోయిన్ ఖరారు!
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రని యాత్ర పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వైఎస్ఆర్ పాత్రని మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదుల చేసిన సంగతి తెలిసిందే. వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వైఎస్ స్నేహితుడు కెవిపి రామచంద్ర రావు పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలోకి మరో కీలక నటి చేరింది. వైఎస్ కుమార్తె షర్మిల పాత్ర కోసం సీనియర్హీరోయిన్ భూమికని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కీలక నటీ నటులతో వైఎస్సార్ బయోపిక్ చిత్రం భారీగా మారుతోంది.
బాహుబలి2 చిత్రంతో గుర్తింపు పొందిన ఆశ్రితి వేముగంటి.. విజయమ్మ పాత్రలో నటించబోతోంది. ఇక జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం తేలాల్సివుంది. వైఎస్సార్ బయోపిక్ చిత్రంతో రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.