Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పృథ్వీ కామెడీ పేలుతుందని ముందే అనుకొన్నా.. నరేష్
యువసామ్రాట్ నాగచైతన్య , అను ఇమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణ లో నాగవంశి.ఎస్, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన హిలేరియస్ ఫ్యామిలి ఎంటర్టైనర్ శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయకచవితి సంధర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మెదటిరోజు 12 కోట్లు వసూలు చేయ్యటమె కాకుండా మూడురోజులకి దాదాపు 23 కోట్ల రూపాయిలు వసూలు చేసి పీపుల్స్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువసామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ మారుతి, నరేష్, 30 ఇయర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి, నిర్మాత నాగవంశి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ... శైలజా రెడి అల్లుడు సూపర్ హిట్ శుభాకాంక్షలు. పీపుల్స్ డైరెక్టర్ మారుతికి కంగ్రాట్స్. అందరి పల్స్ క్యాప్చర్ చేసిన ఈ జెనరేషన్ డైరెక్టర్. నాగచైతన్య లవర్ బాయ్ రోల్స్ అద్భుతంగా చేస్తూ.... కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా హయ్యెస్ట్ గ్రాసర్ సొంతం చేసుకున్నాడు.
రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్ డే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక హాసిని సంస్థల తో నాకు మంచి రిలేషన్ ఉంది. వరుసగా హిట్స్ అందిస్తున్నారు.
పృథ్వీ అద్భుతమైన సీన్స్ చేశాడు. షూటింగ్ అప్పుడే పృథ్వీ సీన్స్ పేలతాయని అర్థమైంది. అను టాలీవుడ్ లో సూపర్ హిరోయిన్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కి నేను ముందే చెప్పాను ఈ వినాయక చవితి మీదే అని. వినాయకచవితి కుడుముల లాగ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా మారుతి అందించాడు.
నాకు భలే భలే మగాడివోయ్ సినిమాతో నరేష్ మళ్లీ కామెడీ చేయగలగడని నిరూపించింది. మారుతి స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న దమ్మున్న డైరెక్టర్. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగా పండింది.
నాగచైతన్య యూత్ ని, రమ్యకృష్ణ ఫ్యామిలీస్ ని, అను కుర్రాళ్లని థియేటర్లకు రప్పిస్తున్నారు. ఈ ఏడాది ఫస్ట్ పండగలో, ఫస్ట్ హిట్ లో నేనుండడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.