Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నరసింహనాయుడు పార్ట్ 2 సిద్దం అయిపోయినట్టేనా?: స్క్రిప్ట్ కూడా సిద్దమైపోయిందట
Recommended Video
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చాలాకాలం క్రిందట వచ్చిన సినిమా 'నరసింహనాయుడు'. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రీతీ జింగ్యానీ, సిమ్రాన్ ఆడిపాడారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా.. అని చెప్పలేం. అప్పటివరకున్న టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం లిఖించి రికార్డుల ప్రవాహం పారించింది.
బాలయ్య కెరీర్లో
అంతేకాదు బాలయ్య కెరీర్లో మరపురాని చిత్రంగా ప్రేక్షకులమదిలో ఉండిపోయింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు సీక్వల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ‘నరసింహనాయుడు` చిత్రం ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ గా నిలిచింది.
రికార్డులు తిరగరాసింది
ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. 2001లో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2001లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బాలకృష్ణ సినీ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ అంగీకారం
'నరసింహనాయుడు' సినిమాకి కథను అందించిన చిన్నికృష్ణ .. ఈ సినిమా సీక్వెల్ కి కథ రాసుకుని వెళ్లి రీసెంట్ గా బాలకృష్ణకి వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో, చేద్దామని బాలకృష్ణ అంగీకారాన్ని తెలిపినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. బాలకృష్ణ వరుసగా సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు.
సీక్వెల్ కోసం స్క్రిప్ట్
చిత్ర రచయిత చిన్నికృష్ణ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. బాలకృష్ణ సైతం సీక్వెల్ చేయడానికి ఆసక్తిగా వున్నారని, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయగానే సీక్వెల్పై దృష్టిపెడతారని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ జై సింహా చిత్రంలో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ బయోపిక్లో నటించనున్నారు. తేజ దర్శకత్వం వహిస్తాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నరసింహనాయుడు పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెలువడనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.